ఆర్జేడీ అధినేత లాలూకు పెరోల్ మంజూరు!
- మూడు రోజుల పెరోల్ మంజూరు
- లాలూ మీడియాతో మాట్లాడకూడదు
- ఏ పార్టీ నేత ఆయన్ని కలవకూడదని కోర్టు నిబంధనలు
పెరోల్ పై బయట ఉన్న మూడు రోజులు మీడియాతో లాలూ మాట్లాడకూడదని, ఏ పార్టీ నేత, కార్యకర్త ఆయన్ని కలిసేందుకు, మాట్లాడేందుకు వీలు లేదని కోర్టు నిబంధనలు విధించినట్టు చెప్పారు. లాలూకు మూడు రోజుల పాటు బీహార్, జార్ఖండ్ పోలీసులు భద్రత కల్పిస్తారని, ఆయనకు కేటాయించిన భద్రతా బలగాల్లో నలుగురు డీఎస్పీలను నియమించినట్టు చెప్పారు.