MS Dhoni: ధోనీతో ఆ అమ్మాయి దిగిన ఫొటోలు వైరల్‌!

  • చెన్నై టీమ్‌ మ్యాచ్‌లకు హాజరవుతోన్న అమ్మాయి
  • ఆమె ఎవరన్న విషయంపై స్పష్టత
  • పేస్‌ బౌలర్‌ దీపక్‌ చాహార్‌ సోదరి
టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్‌ ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథిగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ అమ్మాయితో ఫొటో దిగాడు. ఆ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ కావడంతో ఆమె ఎవరనే విషయంపై అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆమె చెన్నై ఆడే మ్యాచ్‌లకు హాజరవుతూ సదరు జట్టును ప్రోత్సహిస్తూ కనపడుతోంది.

చివరకు ఆ అమ్మాయి ఎవరన్న విషయం తెలిసింది. ఆమె.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో పేస్‌ బౌలర్‌ దీపక్‌ చాహార్‌ సోదరి మాలతి చాహార్‌. ఈమె ధోనీకి వీరాభిమాని అట. ఇటీవల ఐపీఎల్‌ మ్యాచు చూడడానికి వచ్చి తన సోదరుడితో కలిసి ధోనీతో ఫొటోలు దిగింది.    
MS Dhoni
Twitter
viral photos

More Telugu News