జిన్ పింగ్ తో కలసి బోట్ రైడ్ కెళ్లిన నరేంద్ర మోదీ!
- ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న నరేంద్ర మోదీ
- వూహాన్ కు వచ్చి కలిసిన జిన్ పింగ్
- పలకరింపుల తరువాత విహారానికి
కాగా, ప్రతి దేశం నుంచి ఆరుగురు చొప్పున దౌత్యాధికారులతో రెండు రౌండ్ల పాటు సమావేశాలు జరగనుండగా, వీటికి ఇరు దేశాధినేతలూ హాజరు కానున్నారు. ఆ తరువాత సెంట్రల్ వుహాన్ లోని ఈస్ట్ లేక్ గెస్ట్ హౌస్ లో మోదీ గౌరవార్థం జిన్ పింగ్ విందును ఏర్పాటు చేశారు. ఆపై రేపు ఇద్దరి మధ్యా మరోసారి చర్చలు సాగుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. గత సదస్సుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాల అమలు, రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య బంధాలు, సరిహద్దుల్లో పరిస్థితులతో పాటు ఎకనామిక్ కారిడార్ తదితర అంశాలూ ప్రస్తావనకు రానున్నాయి.