బరితెగించిన చైనా... అరుణాచల్ ప్రదేశ్ లో భారీ అక్రమ కట్టడాలు
- బరితెగించిన డ్రాగన్ కంట్రీ
- సరిహద్దుల వెంబడి అరుణాచల్ ప్రదేశ్ లో భారీ కట్టడాలు
- ఆంజా జిల్లాలో టెలీకమ్యూనికేషన్ టవర్ తో పాటు అబ్జర్వేషన్ పోస్ట్ ను ఏర్పాటు చేసిన చైనా
ఆంజా జిల్లాలో చైనా కొత్తగా టెలీకమ్యూనికేషన్ టవర్ తో పాటు అబ్జర్వేషన్ పోస్ట్ ను కూడా నిర్మించడం, దాని కోసం నిఘా పరికరాలను కూడా ఏర్పాటు చేయడం ఆందోళనకరం. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటపడ్డాయి. డోక్లాం సరిహద్దుల్లో ఎల్ఏసీ వద్ద చైనా హెలిప్యాడ్లను, సెంట్రీ పోస్టులను నిర్మిస్తున్నదని ఇటీవల పార్లమెంట్ లో రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.