బీజేపీతో కలిసి నడుస్తాం.. తేల్చేసిన వైసీపీ!
- బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తుంది
- మోదీపై మాకు అచంచల విశ్వాసం ఉంది
- కాంగ్రెస్కు మద్దతు ఇవ్వబోం.. ఆ పార్టీపై నమ్మకం లేదు
- జాతీయ చానల్ ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
తాము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది కదా, మరి ఆ పార్టీతో కలుస్తారా? అన్న రాజ్దీప్ వ్యాఖ్యలను విజయసాయి కొట్టిపడేశారు. కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని, కాబట్టి ఆ పార్టీని నమ్మలేమని పేర్కొన్నారు. బీజేపీ మాత్రమే హోదా ఇవ్వగలదని, మోదీ తమ డిమాండ్ను అంగీకరిస్తారన్న నమ్మకం ఉందని ఎంపీ వివరించారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంటే ఆ పార్టీతో వైసీపీ జత కడుతుందా? అన్న ప్రశ్నకు విజయసాయి మాట్లాడుతూ.. హోదా ఇస్తామన్న వారితో కలిసి నడవడమే తమ విధానమని, ఈ విషయాన్ని జగన్ స్పష్టంగా పేర్కొన్నారని స్పష్టం చేశారు. కాగా, మోదీపై అంత విశ్వాసం ఉన్నప్పుడు ఆయన సర్కారుపై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెడుతున్నారంటూ ఇతర పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.