హోలీ ఏడాదికి ఒక్కసారే... నమాజ్ రోజూ ఉంటుంది: తీవ్ర సంచలనం సృష్టిస్తున్న యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు

  • ఫుల్ పూర్ ఎన్నికల ప్రచారంలో యోగి
  • ర్యాలీలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు
  • విమర్శిస్తున్న కాంగ్రెస్, ఎస్పీ
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సంవత్సరంలో హోలీ పండగ ఒక్కసారి మాత్రమే వస్తుందని, ఆ పండగను ప్రతి ఒక్కరూ గౌరవించాలని చెబుతూ, నమాజ్ ప్రతి రోజూ ఉంటుందని, దాన్ని చాలాసార్లు చదువుతూనే ఉంటారని వ్యాఖ్యానించారు. హోలీ గురించి మాట్లాడుతూ, నమాజ్ ప్రస్తావన తేవడం ఎందుకని ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 11న ఉప ఎన్నికలు జరగనున్న ఫుల్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం పర్యటిస్తున్న ఆయన, ఓ ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా, యూపీలో నమాజ్ జరిగే సమయంలోనే హోలీ ర్యాలీ సాగుతుండటం, ఆ సమయంలో నమాజ్ కు వెళ్లే వారిపై గులాల్ చల్లడం, ఆపై జరిగిన మత ఘర్షణల నేపథ్యంలో ఈ సంవత్సరం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు విజ్ఞప్తి నేపథ్యంలో సున్నిత ప్రాంతాల్లో శుక్రవారం నమాజ్ సమయాన్ని 30 నిమిషాల నుంచి గంట వరకూ వాయిదా వేశారు. ఈ నిర్ణయాన్ని లక్షలాది మంది ప్రజలు స్వాగతించారు కూడా. అయితే, దాన్ని ప్రస్తావిస్తూ, యోగి చేసిన వ్యాఖ్యలు మాత్రం కాక రేపుతున్నాయి. ఆదిత్యనాథ్ ఇలా మాట్లాడటం మత ఉద్రిక్తతలను పెంచుతుందని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
Go Back to Shorts
Uttar Pradesh
Yogi Adityanath
Namaz
Holi

More Telugu News