చైనా ఖైదీలతో 'సీపెక్' ప్రాజక్టు పనులు చేయిస్తున్నారు!: బయటపెట్టిన పాక్ ఎంపీ
- సీపెక్ పనులు చేపట్టిన చైనా ఖైదీలు
- దీని వల్ల భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్న నవాబ్ మహ్మద్
- పాక్, చైనాల మధ్య రహస్య ఒప్పందం జరిగి ఉంటుంది
దీనిపై పాక్ హోంశాఖను సంప్రదించినప్పటికీ ఎలాంటి స్పందన కనిపించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల్లో ఖైదీలను ఉపయోగించుకోవడం సాధారణమే అయినప్పటికీ, చైనా నుంచి ఖైదీలను పాక్ కు తీసుకురావడం ఆశ్చర్యకరమని ఆయన పేర్కొన్నారు. ఒక దేశం నుంచి మరో దేశానికి ఖైదీలను తీసుకురావడం అంటే సాధారణ విషయం కాదని, దీని గురించి రెండు దేశాల మధ్య రహస్య ఒప్పందం జరిగి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా, సీపెక్ లో పనిచేస్తున్న చైనా దేశీయులకు ప్రత్యేక భద్రత కల్పించామని పాక్ ప్రత్యేక సెక్రటరీ (ఇంటీరియర్) రిజ్వాన్ మాలిన్ తెలిపారని డాన్ పత్రిక కథనం ప్రచురించింది.