చిత్తూరులో యెమన్ విద్యార్థి ఆత్మహత్య.. కారణాలపై పోలీసుల ఆరా
- ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్న ఖాలెద్
- మరో మిత్రుడితో కలిసి స్థానికంగా అద్దెకుంటూ చదువు కొనసాగింపు
- మిత్రుడు లేకపోవడం చూసి ఆత్మహత్య
ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని తీసుకొచ్చిన ఖాలెద్ ఆమెను కేరళకు తీసుకెళ్లి వైద్యం చేయించాడు. అతడి రూమ్మేట్ అల్ షబీ కూడా అనారోగ్యంతో బాధపడుతూ కేరళలో చికిత్స తీసుకుంటున్నాడు. శనివారం చికిత్స కోసం అల్ షబీ మరోమారు కేరళకు వెళ్లగా తన తల్లికి కూడా అక్కడి నుంచి మందులు తీసుకురావాలని ఖాలెద్ కోరాడు.
కేరళ వెళ్లిన అల్ షబీ అక్కడి నుంచి స్నేహితుడికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మరో మిత్రుడికి ఫోన్ చేసి గదికి వెళ్లాల్సిందిగా కోరాడు. దీంతో ఖాలెద్ ఆత్మహత్య విషయం బయటపడింది. గదికి వెళ్లిన మిత్రులు హతాశులయ్యారు. అచేతనంగా పడి ఉన్న ఖాలెద్ను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు.