త్వరలోనే మెగా ఫోన్ పట్టే ఆలోచన వుంది: ధన్ రాజ్

కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ధన్ రాజ్ .. అడపాదడపా హీరోగాను తెరపై కనిపిస్తున్నాడు. ఇక 'ధనలక్ష్మీ తలుపుతడితే' సినిమాతో నిర్మాతగా మారిన ధన్ రాజ్, ఇకపై సినిమాలు నిర్మించకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే మెగాఫోన్ చేతబట్టి దర్శకుడిగా మారే అవకాశం ఉందని తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

"ఒక సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ అయితే వుంది. అది వచ్చే సంవత్సరమా .. ఆపై సంవత్సరమా? అనేది తెలియదు. స్క్రిప్ట్ అయితే రాసుకుని పెట్టుకున్నాను. వేరేవాళ్లయితే నా థాట్ ను అలాగే తీయగలరా? లేదా? అనే ఒక భయం ఉండటం వల్లనే నేనే డైరెక్షన్ చేయాలనుకుంటున్నాను. డైరెక్షన్ చేసే అవకాశం మాత్రం పక్కాగా వుంది" అంటూ తేల్చి చెప్పాడు.  


More Telugu News