కిం కర్తవ్యం... ఈపీఎస్, ఓపీఎస్ అత్యవసర సమావేశం!
- ఆర్కే నగర్ లో ఘోర పరాజయం
- ఆ వెంటనే స్వరం మార్చిన కొందరు నేతలు
- ఉదయం 11 గంటలకు సమావేశం
ఆర్కే నగర్ లో ఓటమికి దారితీసిన కారణాలపై విశ్లేషణ జరిపేందుకే సమావేశం అని చెబుతున్నప్పటికీ, ఫలితం తరువాత మారిన పరిస్థితులను సమీక్షించేందుకే సమావేశం జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమ చేతిలోని ఎమ్మెల్యేలు, నేతలు దినకరన్ వైపు పోకుండా చూసుకోవడమే లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు మంతనాలు సాగించనున్నట్టు తెలుస్తోంది.