పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ అందించిన ఏపీసీసీ!
- ఈ ప్రాజెక్టు ఏపీకి చాలా అవసరం
- సాగు, తాగునీరు అందుతుంది
- నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలి
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఈ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వమే చేపడుతుందని చెప్పారని అన్నారు. ఈ విషయంపై అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటన కూడా చేశారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తికావడం ఆంధ్రప్రదేశ్కు ఎంతో అవసరమని, కేంద్ర ప్రభుత్వం నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేయాలని తాము కోరుతున్నామని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రిని కలసిన అనంతరం మీడియాతో రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ, వైసీపీ ఈ అంశాన్ని లేవనెత్తాలని డిమాండ్ చేశారు. పోలవరం అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తితే తాము కూడా అందుకు సహకరిస్తామని చెప్పారు.