రెండో రోజు ఆట ముగిసింది... శ్రీలంక 131/3
- వెలుతురు మందగించడంతో ముగిసిన రెండో రోజు ఆట
- 536 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన కోహ్లీ
- 136 పరుగు వద్ద రెండో రోజు ఆటను ముగించిన శ్రీలంక
తొలి బంతికే షమి ఓపెనర్ కరుణరత్నెను పెవలియన్ కు పంపాడు. అనంతరం పెరీరాకు జతకలిసిన డిసిల్వా (1) కూడా తొందరగానే అవుటయ్యాడు. అనంతరం పెరీరా (42) అర్ధసెంచరీకి చేరువవుతున్న దశలో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. దీంతో మథ్యూస్ (57) కు చండిమాల్ (25) జతకలిశాడు. సీనియర్ ఆటగాడు మాథ్యూస్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం వెలుతురు సరిగ్గా లేకపోవడంతో రెండో రోజు ఆటను ముగించారు. ఆటముగిసే సమయానికి శ్రీలంక జట్టు మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.