మీడియాను వారిస్తూ కన్నీరు పెట్టుకున్న ఐశ్వర్యారాయ్!
- తండ్రి జయంతి రోజున 100 మంది గ్రహణం మొర్రి చిన్నారులకు శస్త్రచికిత్స చేయించిన ఐశ్వర్య
- 100 మంది చిన్నారులకు 2011లో ఆపరేషన్ చేయించిన ఐశ్వర్య తండ్రి
- మీడియా రావడంతో ఇది వ్యక్తిగత కార్యక్రమమంటూ కన్నీటి పర్యంతం
దీంతో ఉద్వేగానికి గురైన ఐశ్వర్య.. వారితో "ప్లీజ్, నా ఫొటోలు తీయకండి. నేను ఏ పని కోసం ఇక్కడికి వచ్చానో మీకు తెలియదు. ఇది సినిమా ప్రీమియర్ షో కాదు. పబ్లిక్ ఈవెంట్ అంతకన్నా కాదు" అంటూ ఆమె సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఆమె మాటలను పట్టించుకోకుండా మీడియా ప్రతినిధులు ఫోటోలు, వీడియోలు తీయడంతో ఆవేదనకు గురైన ఐశ్వర్య "అసలు మీరెందుకిలా ప్రవర్తిస్తున్నారు?" అంటూ కన్నీటిపర్యంతమైంది.
కాగా, కృష్ణారాజ్ కూడా గ్రహణం మొర్రితోనే జన్మించారట. ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసిన ఆయన 2011లో 100 మంది గ్రహణం మొర్రి బాధిత చిన్నారులకు సర్జరీ చేయించారు. తండ్రి స్ఫూర్తితో ఐశ్వర్య కూడా ఆపరేషన్లు చేయించింది.