4జీ వీఓఎల్టీఈ ఫీచర్ ఫోన్ను ఆవిష్కరించిన బీఎస్ఎన్ఎల్... ధర రూ. 2,200
- `భారత్ 1` పేరుతో మార్కెట్లోకి
- మైక్రోమ్యాక్స్ సహకారంతో రూపొందించిన బీఎస్ఎన్ఎల్
- అక్టోబర్ 20 నుంచి అమ్మకాలు
పూర్తిగా భారత్లోనే తయారైన ఈ ఫీచర్ ఫోన్ 22 భాషలను సపోర్ట్ చేస్తుంది. ఇందులో లైవ్ టీవీ వంటి బీఎస్ఎన్ఎల్ సూట్ సర్వీసెస్తో పాటు భీమ్ (భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ) అప్లికేషన్లు ప్రీలోడెడ్గా వుంటాయి. ఈ ఫీచర్ ఫోన్ ద్వారా నెలకు రూ. 97 రీఛార్జీతో అన్లిమిటెడ్ ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ వాడుకునే సదుపాయాన్ని కల్పించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. ఈ ఫోన్ను కేవలం బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్కే పరిమితం చేయకుండా, ఇతర నెట్వర్కుల సిమ్ కార్డులు కూడా వేసుకుని వాడుకునేలా రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.