ఓపక్క వర్షం అంటున్నారు.. మరి, రేపు మ్యాచ్ జరుగుతుందా?

ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ రేపు సాయంత్రం హైదరాబాదులోని ఉప్పల్ లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. హైదరాబాదును గత వారం రోజులుగా ఏదో ఒక సమయంలో వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. రానున్న రెండు రోజులపాటు హైదరాబాదులో వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తాజాగా ప్రకటన చేసింది.

ఈ నేపథ్యంలో ఫలితం తేలాల్సిన చివరి టీ20 మ్యాచ్ జరగడం సందేహాస్పదమేనని అంటున్నారు. ఈ మ్యాచ్ కోసం హైదరాబాదీ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టికెట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయి. అయితే స్టేడియంలో అత్యుత్తమ డ్రైనేజీ సిస్టమ్ ఉందని, భారీ వర్షం కురిస్తే చేయగలిగేది లేదు కానీ ఓ మోస్తరు వర్షం వల్ల మ్యాచ్ ఆగదని క్యూరేటర్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్ కు హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. 
Go Back to Shorts
cricket
team india
Australia
hydarabad
uppal
3rd t20

More Telugu News