పూర్తిగా నిండిన శ్రీశైలం... నీటిని వదలాలని చంద్రబాబు సర్కారు లేఖ
- 884 అడుగులకు చేరిన నీటిమట్టం
- వెంటనే సాగర్ కు నీరివ్వాలని కృష్ణా యాజమాన్య బోర్డుకు లేఖ
- తెలంగాణను అడిగి సమాధానం ఇస్తామన్న బోర్డు
ఇక ప్రాజెక్టు నిండటం, నైరుతి రుతుపవనాల ప్రభావం కొనసాగుతూ ఉండటంతో, నాగార్జున సాగర్ జలాశయానికి నీటిని విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాసింది. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు నీటిని విడుదల చేయాల్సి వుందని, అందుకోసం నీరు అత్యవసరమని పేర్కొంది. కనీసం పైనుంచి వచ్చిన నీటినైనా విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు వదలాలని కోరింది. ఈ లేఖపై తెలంగాణ నీటి పారుదల శాఖ అభిప్రాయాన్ని స్వీకరించి తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని బోర్డు పేర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా, ఆల్మట్టికి 14,080 క్యూసెక్కులు, నారాయణపూర్ కు 16,481 క్యూసెక్కులు, జూరాలకు 34,172 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఆ మొత్తాన్ని దిగువకు వదలుతున్నారు.