మళ్లీ పని ప్రారంభించిన చైనా... అరుణాచల్ సరిహద్దుల్లో కొత్త హైవే ప్రారంభం!
- 409 కి.మీ. టోల్ ఫ్రీ రోడ్డు ప్రారంభం
- లాసా నుంచి నింగ్జి వరకూ నిర్మాణం
- సైనిక అవసరాల కోసమే!
కాగా, ఈ జాతీయ రహదారిని సైనిక అవసరాలకు వాడుకునే నిమిత్తమే చైనా నిర్మించిందని తెలుస్తోంది. ఆయుధాలు, ట్యాంకర్లు, తేలికపాటి క్షిపణులను సులువుగా భారత సరిహద్దుల వైపు తీసుకురావడమే చైనా లక్ష్యమని సమాచారం. ఇదిలావుండగా, ప్రస్తుతానికి ఈ హైవేపై హెవీ ట్రక్కుల రాకపోకలపై నిషేధం ఉందని 'క్సిన్హువా' పేర్కొంది. ఇండియా చైనా మధ్య 3,488 కిలోమీటర్ల సరిహద్దు రేఖ ఉండగా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం దక్షిణ టిబెట్టని, అది తమ భూభాగమేనని చైనా వితండ వాదం చేస్తున్న సంగతి తెలిసిందే. 1962 నాటి చైనా, భారత యుద్ధం తరువాత అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుందని, వెంటనే దాన్ని ఖాళీ చేయాలని ఇండియా డిమాండ్ చేస్తున్న విషయం విదితమే.