అంతర్జాతీయ విత్తనాబివృద్ధి సంస్థ చైర్మన్ గా డాక్టర్ కేశవులు

Related image

  • సూర్యాపేట జిల్లాకు దక్కిన అరుదైన అవకాశం
  • ఆసియా ఖండంలో తెలంగాణాకు రావడం మొదటిసారి
  • అభినందించిన మంత్రి జగదీష్ రెడ్డి 
హైదరాబాద్: అంతర్జాతీయ విత్తనాభివృద్ది సంస్థ *(IFTA)* అధ్యక్షుడుగా డాక్టర్ కేశవులు నియమితులైనారు.స్వీట్జర్ ల్యాండ్ కేంద్రంగా IFTA ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ యండిగా విధులు నిర్వహిస్తున్న కేశవులు స్వగ్రామం సూర్యాపేట జిల్లా నాగరం మండల కేంద్రం. అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశం పొందిన కేశవులు మర్యాద పూర్వకంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని కలిశారు.ఆసియా ఖండంలోనే మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ స్థాయిలో IFTA చైర్మన్ గా నియమితులైన డాక్టర్ కేశవులును ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దా లన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప సిద్ధికి IFTA తోడ్పాటు నందించే విదంగా కేశవులు ముందుకు పోవాలని సూచించారు.

More Press Releases