కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Related image

తెలంగాణ రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి స్వదేశీ దర్శన్, ప్రసాద్ స్కీంలలో చేర్చి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిలో భాగంగా స్వదేశీ దర్శన్ స్కీంలో చరిత్రాత్మక కోటల సంరక్షణ, మహబూబ్ నగర్ జిల్లాలోని పిలిగ్రీమేజ్ అండ్ నేచర్ టూరిజం సర్క్యూట్ ను, ప్రసిద్ధ బుద్ధిజం కేంద్రాల అభివృద్ధి చేయాలని వివరాల్ని అందించారు.

ప్రసాద్  స్కీంలో భాగంగా భద్రాచలంలోని సీత రామచంద్ర స్వామి దేవస్థానం, మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలను అభివృద్ధి చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

మహబూబ్ నగర్ పట్టణంలో సుమారు 25 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న కల్చరల్ సెంటర్ కు ఠాగూర్ కల్చరల్ కాంప్లెక్స్ స్కీం ద్వారా 15 కోట్ల రూపాయల ఆర్థిక సహకారంను అందించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అడాప్ట్ ఎ హెరిటేజ్ స్కీంలో ఎంపికైన గోల్కొండ కోట, అలంపూర్ జోగులంబా దేవాలయం, రామప్ప దేవాలయంల పనులను తక్షణమే ప్రారంభించాలని మంత్రి కోరారు.

హైదరాబాద్ నగరం MICE టూరిజం, మెడికల్ క్యాపిటల్ గా అభివృద్ధి లో చెందుతున్నా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (I I T T M) క్యాంపస్ ను ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన భూమిని ఉచితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుందని అందుకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలసి రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, ఈడీ శంకర్ రెడ్డిలు పాల్గొన్నారు.  

More Press Releases