రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తవం: విజయవాడ మేయ‌ర్‌

Related image

  • ఈ-కేవైసీ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మేయ‌ర్‌ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ: రేషన్ కార్డులకు సంబంధించి ఈ-కేవైసీ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌ని, ఈ -కేవైసీ నమోదు చేసుకోకుంటే రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తవమని న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి పేర్కొన్నారు. ప్రస్తుతం మరే ఇతర రాష్ట్రాల్లోని లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలువుతున్నాయి అని మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1.48 కోట్ల రేషన్‌ కార్డుల్లో 4కోట్ల మందికి పైగా సభ్యులున్నారు. వీరిలో 85శాతం మంది ఈ-కేవైసీ వివరాలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 35 లక్షల మందికిపైగా నమోదు చేయించుకోవాల్సి ఉంది.

ఫోన్‌లో సబ్‌కలెక్టర్‌ జి.సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌తో మాట్లాడిన మేయ‌ర్‌:
విజ‌య‌వాడ న‌గ‌రంలోవారు 1,46,324 మంది ఉంటే వారిలో 31900 ఇప్ప‌టి వరకు ఈ-కేవైసీ వివరాలు నమోదయ్యాయని ఇంకా 114424 మంది నమోదు చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్ర‌జ‌లు ఈ-కేవైసీ కోసం మీ-సేవ, ఆధార్ కేంద్రాల వ‌ద్ద  భారీగా చేర‌డంతో కొంద‌రు వారి దగ్గర నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అనే విష‌యంపై ఫోన్‌లో సబ్‌కలెక్టర్‌ జి.సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌తో మేయ‌ర్ మ‌ట్లాడారు. దీంతో స్పందించిన సబ్‌కలెక్టర్‌ జి.సూర్యసాయి ప్రవీణ్‌ చంద్ మ‌ట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ-కేవైసీ నమోదు చేస్తున్నాం అన్నారు. ప్రతి ఒక్కరు ఆధార్ డేటా తో ఈ - కేవైసీ చేసుకోవాల‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌గ‌రంలో ఈ - కేవైసీ కేంద్రాలు 71 ఉన్నాయ‌ని, మ‌రో రెండు సెంట‌ర్లు అదనంగా చేర్చ‌డం జ‌రిగింద‌ని, త‌ర్వ‌లో మ‌రో 10 కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు మేయ‌ర్‌కు ఫోన్‌లో వివ‌రించారు. ప్ర‌జ‌లు కోవిడ్ నియమాలు పాటిస్తూ ఈ-కేవైసీ చేసుకోవాల‌ని మేయ‌ర్ సూచించారు.

More Press Releases