రూ.3 కోట్ల లాటరీ గెలుచుకున్న క్యాబ్ డ్రైవర్.. తండ్రి కలను నెరవేరుస్తానంటూ ఆనందం
- పంజాబ్ లాటరీలో హిమాచల్ ప్రదేశ్ క్యాబ్ డ్రైవర్కు బంపర్ ప్రైజ్
- రూ.3 కోట్ల జాక్పాట్ గెలుచుకున్న కల్యాణ్ చంద్
- ప్రయాణికుడిని దించేందుకు వెళ్లి లాటరీ టికెట్ కొనుగోలు
- వచ్చిన డబ్బుతో పాత ఇంటిని తిరిగి నిర్మిస్తానన్న విజేత
వివరాల్లోకి వెళితే.. కల్యాణ్ చంద్ ఇటీవలే ఒక ప్రయాణికుడిని పంజాబ్లోని బటిండాలో దింపేందుకు తన ట్యాక్సీలో వెళ్లారు. అక్కడ ఒకే నంబర్తో ఉన్న రెండు లాటరీ టికెట్లను ఒక్కోటి రూ.500 చొప్పున కొనుగోలు చేశారు. తాజాగా లాటరీ ఫలితాలు విడుదల కాగా, ఆయన కొనుగోలు చేసిన ఒక టికెట్ను మొదటి బహుమతి వరించింది. దీంతో ఆయన సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
ప్రస్తుతం నెలకు రూ.15,000 నుంచి రూ.16,000 వరకు సంపాదిస్తున్న తనకు ఇంత పెద్ద మొత్తంలో నగదు బహుమతి రావడంపై కల్యాణ్ చంద్ హర్షం వ్యక్తం చేశారు. "ఈ డబ్బుతో నా తండ్రి చిరకాల కలను నెరవేరుస్తాను. మా గ్రామంలో ఉన్న రెండు గదుల ఇంటిని పునర్నిర్మిస్తాను" అని ఆయన తెలిపారు. లాటరీ గెలిచిన విషయాన్ని నిర్ధారించుకున్న అనంతరం, కల్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి బటిండా వెళ్లి బహుమతి మొత్తం కోసం దరఖాస్తు చేసుకున్నారు.