భార్య పరారీ.. కన్నబిడ్డలను చంపి, భర్త ఆత్మహత్య
- మేనల్లుడితో భార్య జంప్
- ఇద్దరు కన్నబిడ్డలను గొంతు నులిమి చంపిన భర్త
- అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య
- కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో విషాద ఘటన
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్య మరొకరితో వెళ్లిపోయిందన్న మనస్తాపంతో ఓ తండ్రి తన ఇద్దరు కన్నబిడ్డలను కిరాతకంగా హతమార్చి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన కుణిగల్ తాలూకాలోని అల్కెరె గ్రామంలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే, అల్కెరె గ్రామానికి చెందిన శివన్న (40) స్థానిక మల్లేశ్వర స్వామి ఆలయంలో పూజారిగా, ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య కావ్య, ఇద్దరు కుమారులు జీవన్ (11), ప్రణేశ్ (6) ఉన్నారు. అయితే, కొద్దికాలంగా కావ్యకు శివన్న మేనల్లుడైన (సోదరి కొడుకు) హేమంత్తో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. వారం రోజుల క్రితం ఆమె హేమంత్తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది.
భార్య కనిపించడం లేదని శివన్న పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కౌన్సిలింగ్ ఇచ్చి కావ్యను తిరిగి ఇంటికి పంపించారు. అయితే, ఇంటికి వచ్చిన మరుసటి రోజే ఆమె నగదు, బంగారు ఆభరణాలతో మళ్లీ హేమంత్తో కలిసి పరారైంది. ఈ పరిణామంతో తీవ్రంగా కుంగిపోయిన శివన్న శుక్రవారం రాత్రి తన ఇద్దరు కుమారుల గొంతు నులిమి చంపి, అనంతరం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నిన్న ఉదయం బంధువులు, స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మూడేళ్ల క్రితం కావ్య వేధింపుల వల్లే శివన్న తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళితే, అల్కెరె గ్రామానికి చెందిన శివన్న (40) స్థానిక మల్లేశ్వర స్వామి ఆలయంలో పూజారిగా, ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య కావ్య, ఇద్దరు కుమారులు జీవన్ (11), ప్రణేశ్ (6) ఉన్నారు. అయితే, కొద్దికాలంగా కావ్యకు శివన్న మేనల్లుడైన (సోదరి కొడుకు) హేమంత్తో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. వారం రోజుల క్రితం ఆమె హేమంత్తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది.
భార్య కనిపించడం లేదని శివన్న పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కౌన్సిలింగ్ ఇచ్చి కావ్యను తిరిగి ఇంటికి పంపించారు. అయితే, ఇంటికి వచ్చిన మరుసటి రోజే ఆమె నగదు, బంగారు ఆభరణాలతో మళ్లీ హేమంత్తో కలిసి పరారైంది. ఈ పరిణామంతో తీవ్రంగా కుంగిపోయిన శివన్న శుక్రవారం రాత్రి తన ఇద్దరు కుమారుల గొంతు నులిమి చంపి, అనంతరం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నిన్న ఉదయం బంధువులు, స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మూడేళ్ల క్రితం కావ్య వేధింపుల వల్లే శివన్న తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.