ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు
- 'తిమ్మరాజుపల్లి టీవీ' చిత్ర యూనిట్ను అభినందించిన సీఎం చంద్రబాబు
- ఉండవల్లిలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన చిత్ర బృందం
- కుప్పం నియోజకవర్గానికి చెందిన యువకుడు మునిరాజు ఈ చిత్ర దర్శకుడు
- ఇలాంటి మంచి చిత్రాలు మరెన్నో తీయాలని చిత్ర యూనిట్కు సీఎం సూచన
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 'తిమ్మరాజుపల్లి టీవీ' చిత్ర యూనిట్ను అభినందించారు. ఈ చిత్ర దర్శకుడు మునిరాజు నేతృత్వంలోని బృందం గురువారం ఉండవల్లిలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం సాధించిన విజయం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేసి, వారికి ప్రశంసలు తెలిపారు.
కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, తిమ్మరాజుపల్లెకు చెందిన మునిరాజు దర్శకత్వంలో 'తిమ్మరాజుపల్లి టీవీ' చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం విజయం సాధించడంతో చిత్ర యూనిట్ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, యువత ఇలాంటి సృజనాత్మక రంగాల్లో రాణించడం అభినందనీయమని అన్నారు. సమాజానికి మంచి సందేశం ఇచ్చే ఇలాంటి చిత్రాలను భవిష్యత్తులో మరెన్నో తీయాలని చిత్ర బృందానికి సూచించారు. ముఖ్యమంత్రి అభినందనలతో తమ ప్రయాణం మరింత ప్రత్యేకంగా మారిందని, ఆయన ప్రోత్సాహం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.
కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, తిమ్మరాజుపల్లెకు చెందిన మునిరాజు దర్శకత్వంలో 'తిమ్మరాజుపల్లి టీవీ' చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం విజయం సాధించడంతో చిత్ర యూనిట్ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, యువత ఇలాంటి సృజనాత్మక రంగాల్లో రాణించడం అభినందనీయమని అన్నారు. సమాజానికి మంచి సందేశం ఇచ్చే ఇలాంటి చిత్రాలను భవిష్యత్తులో మరెన్నో తీయాలని చిత్ర బృందానికి సూచించారు. ముఖ్యమంత్రి అభినందనలతో తమ ప్రయాణం మరింత ప్రత్యేకంగా మారిందని, ఆయన ప్రోత్సాహం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.