వెంటనే దేశం వీడండి.. ఇరాన్లోని తన పౌరులకు అమెరికా సలహా!
- ఇరాన్లోని అమెరికా పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని హెచ్చరిక
- ఇరాన్ గగనతలం పాక్షికంగా తిరిగి తెరుచుకోవడంతో ఈ సూచన
- ఇరాన్తో కాల్పుల విరమణను పొడిగించిన ట్రంప్ ప్రభుత్వం
- ఆర్థిక దిగ్బంధం మాత్రం కొనసాగుతుందని వైట్హౌస్ స్పష్టీకరణ
- చర్చలకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేసిన అమెరికా
ఇరాన్లో ఉన్న తమ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని అమెరికా ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ తన గగనతలాన్ని పాక్షికంగా తెరిచిన నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ ఈ సూచన చేసింది. సోషల్ మీడియా ద్వారా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
స్థానిక మీడియాను నిరంతరం గమనిస్తూ ఉండాలని, విమానాల సమాచారం కోసం కమర్షియల్ ఎయిర్లైన్స్ను సంప్రదించాలని అమెరికా పౌరులకు సూచించింది. విమానాలతో పాటు అర్మేనియా, అజర్బైజాన్, టర్కీ, తుర్క్మెనిస్థాన్ దేశాలకు భూమార్గం ద్వారా కూడా ఇరాన్ను వీడవచ్చని తెలిపింది. అయితే, ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్, పాకిస్థాన్-ఇరాన్ సరిహద్దు ప్రాంతాలకు మాత్రం ప్రయాణించవద్దని స్పష్టం చేసింది. జిన్హువా వార్తా సంస్థ కథనం ప్రకారం ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు జరిపిన తర్వాత ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది.
ఇదిలా ఉంటే... ఇరాన్తో కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే సైనిక దాడులను నిలిపివేసినప్పటికీ, ఆర్థికంగా, సముద్ర మార్గంలో ఆంక్షలను మరింత తీవ్రతరం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.. "సైనిక దాడులపై కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, 'ఆపరేషన్ ఎకనామిక్ ఫ్యూరీ', నావికాదళ దిగ్బంధం కొనసాగుతున్నాయి" అని తెలిపారు.
ఈ దిగ్బంధం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందని, రోజుకు 500 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూస్తోందని లెవిట్ పేర్కొన్నారు. ఇరాన్తో చర్చలకు ఎలాంటి గడువు విధించలేదని, అధ్యక్షుడే తుది నిర్ణయం తీసుకుంటారని ఆమె స్పష్టం చేశారు.
స్థానిక మీడియాను నిరంతరం గమనిస్తూ ఉండాలని, విమానాల సమాచారం కోసం కమర్షియల్ ఎయిర్లైన్స్ను సంప్రదించాలని అమెరికా పౌరులకు సూచించింది. విమానాలతో పాటు అర్మేనియా, అజర్బైజాన్, టర్కీ, తుర్క్మెనిస్థాన్ దేశాలకు భూమార్గం ద్వారా కూడా ఇరాన్ను వీడవచ్చని తెలిపింది. అయితే, ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్, పాకిస్థాన్-ఇరాన్ సరిహద్దు ప్రాంతాలకు మాత్రం ప్రయాణించవద్దని స్పష్టం చేసింది. జిన్హువా వార్తా సంస్థ కథనం ప్రకారం ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు జరిపిన తర్వాత ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది.
ఇదిలా ఉంటే... ఇరాన్తో కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే సైనిక దాడులను నిలిపివేసినప్పటికీ, ఆర్థికంగా, సముద్ర మార్గంలో ఆంక్షలను మరింత తీవ్రతరం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.. "సైనిక దాడులపై కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, 'ఆపరేషన్ ఎకనామిక్ ఫ్యూరీ', నావికాదళ దిగ్బంధం కొనసాగుతున్నాయి" అని తెలిపారు.
ఈ దిగ్బంధం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందని, రోజుకు 500 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూస్తోందని లెవిట్ పేర్కొన్నారు. ఇరాన్తో చర్చలకు ఎలాంటి గడువు విధించలేదని, అధ్యక్షుడే తుది నిర్ణయం తీసుకుంటారని ఆమె స్పష్టం చేశారు.