హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక
- తెలంగాణలో పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
- రానున్న మూడు రోజుల్లో ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం
- వడగాలులు వీచే జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ
ఆయా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు నిజామాబాద్, ఖమ్మం, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, గురువారం ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. వడగాలులు వీచే జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.