Chandrababu Naidu: ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Wishes Ramzan Greetings
షార్ట్స్‌లో చూడండి
పవిత్ర రంజాన్ (మార్చి 21) పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని ముస్లిం సోదరసోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు.

"పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన ఈ రంజాన్ నెలలో ఉపవాసదీక్షలు, ప్రార్థనలు మనసును పవిత్రం చేసుకోవడానికి, మంచి మార్గంలో నడవడానికి, పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించడానికి ఒక మంచి అవకాశం. పేదలకు దానం చేయడం ద్వారా సమాజంలో సమానత్వం పెరుగుతుంది. ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు చేసే ప్రతి ప్రార్థనకు అల్లాహ్ ఆశీస్సులు లభించి, మీ కోరికలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటూ.... ఈద్ ముబారక్" అంటూ చంద్రబాబు తన  పోస్టులో పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
Ramzan
Ramadan
Muslim festival
Eid Mubarak
Islamic prayers
Fasting
Charity
Religious Harmony

More Telugu News