Kavitha: ఇంతకు మించిన ఆధారాలు ఇంకేముంటాయి స్పీకర్ గారు?: కవిత

Kavitha Questions Speakers Actions in Party Defection Case
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆమె వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే, గాంధీ భవన్‌కు వెళ్లి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొంటే అది పార్టీ ఫిరాయించినట్టు కాదా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు.

ఇంతకంటే బలమైన ఆధారాలు ఇంకేం కావాలని కవిత స్పీకర్‌ను నిలదీశారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ బీ-ఫారాలను సదరు ఎమ్మెల్యేనే పంపిణీ చేసిన విషయం అందరికీ తెలిసిందేనని, ఆ విషయం స్పీకర్ దృష్టికి రాలేదా? అని ఆమె అన్నారు. ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను కొట్టివేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

"రాజ్యాంగబద్ధమైన స్పీకర్ స్థానంలో ఉండి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని అనుకోవాలా? అదే నిజమైతే భారత రాజ్యాంగాన్ని, చట్టసభల ఔన్నత్యాన్ని మీరు ఎలా కాపాడగలుగుతారు?" అంటూ కవిత స్పీకర్ తీరును తప్పుబట్టారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో స్పందించారు.
Go Back to Shorts
Kavitha
Kalvakuntla Kavitha
Telangana Assembly
Speaker Gaddam Prasad Kumar
Jagityala MLA Sanjay Kumar
BRS Party
Party Defection
Telangana Politics
Congress Party
Municipal Elections

More Telugu News