ఐబొమ్మ రవి కేసులో కీలక మలుపు.. మరింత బిగుస్తున్న ఉచ్చు!
- ఐబొమ్మ రవి కేసు దర్యాప్తులో సీఐడీ అధికారులు ప్రవేశం
- ఆన్లైన్ బెట్టింగ్ సైట్ల ప్రమోషన్ కోణంలో విచారణ
- మూడో రోజు కస్టడీకి తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు
- రవికి సహకరిస్తున్న వారి వివరాలపై పోలీసుల ఆరా
- సీఐడీ ఎంట్రీతో కేసు విచారణ మరింత వేగవంతం
మరోవైపు సైబర్ క్రైమ్ పోలీసులు రవిని మూడో రోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇవాళ కూడా విచారణ కొనసాగనుంది. నిన్న దాదాపు ఆరు గంటల పాటు సాగిన విచారణలో పలు కీలక వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఐబొమ్మకు కొత్త సినిమాలను ఎవరు సరఫరా చేస్తున్నారు? అతనికి సహకరిస్తున్న ఏజెంట్లు ఎవరు? గేమింగ్ యాప్ల నిర్వాహకులతో రవికి ఉన్న సంబంధాలు ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ కొనసాగుతుండగా, ఇప్పుడు సీఐడీ కూడా రంగంలోకి దిగడంతో ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రెండు ఏజెన్సీల దర్యాప్తుతో రవికి సహకరించిన వారికి ఉచ్చు మరింత బిగుసుకున్నట్లయింది.