Rajasthan Road Accident: రాజస్థాన్ లో డంపర్ ట్రక్ బీభత్సం... 12 మంది మృతి
- జైపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం
- మద్యం మత్తులో డంపర్తో బీభత్సం సృష్టించిన డ్రైవర్
- ప్రమాదంలో 12 మంది దుర్మరణం, 50 మందికి గాయాలు
- 24 గంటల వ్యవధిలో రాజస్థాన్లో ఇది రెండో పెను ప్రమాదం
- సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ప్రమాద దృశ్యాలు
- డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాజస్థాన్ రాజధాని జైపూర్లో సోమవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ డంపర్ ట్రక్ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. వేగంగా వాహనాన్ని నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టడంతో దాదాపు 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, సుమారు 40 నుంచి 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. హర్మడా పోలీస్ స్టేషన్ పరిధిలోని సికార్ రోడ్డు సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ డంపర్ ట్రక్కును అతివేగంతో నడుపుతూ నియంత్రణ కోల్పోయాడు. సుమారు అర కిలోమీటరు దూరం వరకు బ్రేకులు వేయకుండానే కార్లు, బైక్లతో సహా పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. చివరికి ఓ కారును బలంగా ఢీకొట్టి, మరో మూడు వాహనాలపై బోల్తా పడ్డాడు. ఈ ప్రమాదంలో మొత్తం పదికి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఈ ప్రమాద బీభత్సం మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ట్రక్కు వేగంగా దూసుకొచ్చి వాహనాలను చెల్లాచెదురు చేయడం, ప్రాణభయంతో జనం పరుగులు తీయడం వంటి దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని సవాయి మాన్సింగ్ (SMS) ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ మంత్రి డాక్టర్ ప్రేమ్ చంద్ బైర్వా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కాగా, 24 గంటల వ్యవధిలో రాజస్థాన్లో ఇది రెండో పెను ప్రమాదం కావడం గమనార్హం. ఆదివారం రాత్రి ఫలోది జిల్లాలో ఓ టూరిస్ట్ బస్సు ఆగి ఉన్న ట్రైలర్ను ఢీకొట్టిన ఘటనలో 15 మంది యాత్రికులు మృతి చెందారు. తాజా ఘటనతో రాష్ట్రంలో రోడ్డు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ డంపర్ ట్రక్కును అతివేగంతో నడుపుతూ నియంత్రణ కోల్పోయాడు. సుమారు అర కిలోమీటరు దూరం వరకు బ్రేకులు వేయకుండానే కార్లు, బైక్లతో సహా పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. చివరికి ఓ కారును బలంగా ఢీకొట్టి, మరో మూడు వాహనాలపై బోల్తా పడ్డాడు. ఈ ప్రమాదంలో మొత్తం పదికి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఈ ప్రమాద బీభత్సం మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ట్రక్కు వేగంగా దూసుకొచ్చి వాహనాలను చెల్లాచెదురు చేయడం, ప్రాణభయంతో జనం పరుగులు తీయడం వంటి దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని సవాయి మాన్సింగ్ (SMS) ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ మంత్రి డాక్టర్ ప్రేమ్ చంద్ బైర్వా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కాగా, 24 గంటల వ్యవధిలో రాజస్థాన్లో ఇది రెండో పెను ప్రమాదం కావడం గమనార్హం. ఆదివారం రాత్రి ఫలోది జిల్లాలో ఓ టూరిస్ట్ బస్సు ఆగి ఉన్న ట్రైలర్ను ఢీకొట్టిన ఘటనలో 15 మంది యాత్రికులు మృతి చెందారు. తాజా ఘటనతో రాష్ట్రంలో రోడ్డు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.