Garib Rath Express: గరీబ్‌రథ్ రైలులో మంటలు.. లోకోపైలట్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం

Garib Rath Express Engine Fire Averted by Alert Loco Pilot
షార్ట్స్‌లో చూడండి
రాజస్థాన్‌లోని బీవర్ జిల్లా, సెంద్రా రైల్వే స్టేషన్‌లో ఈ తెల్లవారుజామున భారీ ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. లోకోపైలట్ సత్వరం స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా రైలు నుంచి ఖాళీ చేయించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు లోకోపైలట్‌న్ అప్రమత్తం చేశారు. దీంతో ఆయన వెంటనే రైలును నిలిపివేశాడు. గరీభ్‌రథ్‌కు మంటలు అంటుకున్న విషయం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు ఆ మార్గంలోని రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ లేదంటే సాంకేతిక సమస్య కారణంగానే ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. 

ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారిని తమ గమ్యస్థానాలకు చేర్చినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు పేర్కొన్నారు.   
Go Back to Shorts
Garib Rath Express
Garib Rath
Train Fire
Rajasthan Train Accident
Sendra Railway Station
Loco Pilot
Indian Railways
Train Engine Fire
Beawar District

More Telugu News