చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చించుకుంటే తప్పేముంది?: జగ్గారెడ్డి
- చంద్రబాబు, రేవంత్ రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రులన్న జగ్గారెడ్డి
- ఇద్దరూ ఢిల్లీలో ఏం మాట్లాడారో బీఆర్ఎస్ నేతలకు కనిపించలేదా అని ప్రశ్న
- మమ్మల్ని కూడా ఫామ్ హౌస్ లో పడుకోమంటారా అని ఎద్దేవా
చంద్రబాబు, రేవంత్ ఢిల్లీలో ఏం మాట్లాడుకున్నారో బీఆర్ఎస్ నేతలకు కనిపించలేదా? కళ్లు దొబ్బాయా? అని ప్రశ్నించారు. బావబామ్మర్దులది పనికిమాలిన ఏడుపు అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల పట్ల బీఆర్ఎస్ నేతలకు బాధ్యత లేదని విమర్శించారు. మీరు ఫాంహౌస్ లోనే ఉంటున్నారని... మమ్మల్ని కూడా ఫాంహౌస్ లోనే పడుకోమంటారా? అని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పాలన సరిగా లేకనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారని జగ్గారెడ్డి అన్నారు. పదేళ్లు రాజభోగం అనుభవించి పదవి పోయేసరికి షాక్ లో ఉన్నారని అన్నారు. కేటీఆర్ కు పదవి లేదనే బాధ ఓవైపు, చెల్లెలి స్ట్రోక్ మరోవైపు ఉందని చెప్పారు.