ఢిల్లీలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి కీలక సమావేశం
- శ్రమ శక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో సమావేశం
- ఇరు రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలపై చర్చించే అవకాశం
- సమావేశానికి ముందు ఆయా రాష్ట్రాల అధికారులతో ముఖ్యమంత్రులు భేటీ
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
అంతకుముందు, ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల అధికారులతో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. ఇరువురు ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల అధికారులతో గంటన్నర పాటు సమావేశమయ్యారు.


