Konda Murali: కొండా మురళిపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు

Warangal Congress Leaders Complaint Against Konda Murali
షార్ట్స్‌లో చూడండి
వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సీనియర్ నేత కొండా మురళికి వ్యతిరేకంగా పలువురు కీలక నేతలు పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆశ్రయించడంతో ఈ వివాదం మళ్లీ గాంధీ భవన్‌కు చేరింది.

గురువారం నాడు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవితో వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. కొండా మురళి వ్యవహారంపై వీరంతా తమ వాదనలను కమిటీ ముందు వినిపించారు.

ఇటీవల కొందరు కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి కొండా మురళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ నోటీసుకు కొండా మురళి ఇదివరకే తన వివరణను సమర్పించారు. ఇప్పుడు ఆయనపై అసంతృప్తిగా ఉన్న నేతలు తమ వాదనలు వినిపించేందుకు కమిటీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Go Back to Shorts
Konda Murali
Warangal Congress
Congress Party
Mallu Ravi
Kadiyam Srihari

More Telugu News