ఉబర్, ఓలా ప్రయాణికులకు షాక్.. రద్దీ సమయాల్లో రేట్ల పెంపునకు కేంద్రం ఆమోదం
- క్యాబ్ ఛార్జీలపై కేంద్రం కీలక మార్గదర్శకాలు.. సర్జ్ ప్రైసింగ్కు కొత్త రూల్స్
- బేస్ ఛార్జీపై 200 శాతం వరకు వసూలుకు గ్రీన్ సిగ్నల్
- గతంలో ఈ పరిమితి గరిష్టంగా 150 శాతంగా ఉండేది
- 3 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి అదనపు ఛార్జీల నుంచి మినహాయింపు
తాజా నిబంధనల ప్రకారం.. రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో బేస్ ఛార్జీపై గరిష్టంగా 200 శాతం వరకు సర్జ్ ఛార్జీని వసూలు చేసుకునేందుకు క్యాబ్ అగ్రిగేటర్లకు అనుమతి లభించింది. గతంలో ఈ పరిమితి 150 శాతంగా ఉండేది. సాధారణ రద్దీ సమయాల్లో బేస్ ఛార్జీపై 50 శాతం అదనంగా వసూలు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారు.
అయితే, ప్రయాణికులకు కొంత ఊరటనిచ్చేలా కేంద్రం ఒక షరతు విధించింది. మూడు కిలోమీటర్లలోపు చేసే ప్రయాణాలపై ఎలాంటి అదనపు సర్జ్ ఛార్జీలు విధించకూడదని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు క్యాబ్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చనుండగా, రద్దీ వేళల్లో ప్రయాణించే వారిపై ఛార్జీల భారం పెరిగే అవకాశం ఉంది.