Bhargav: విందు ముగించుకుని వస్తుండగా విషాదం.. ఘట్‌కేసర్‌లో ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి

Hyderabad IT Employees Killed in Car Accident Near Ghatkesar
షార్ట్స్‌లో చూడండి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఘట్‌కేసర్‌లో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఒక కారు మాధారం-ఎదులాబాద్ మార్గంలో అదుపు తప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్తు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఐటీ ఉద్యోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

మరణించిన వారిని హయత్‌నగర్ మండలం కుంట్లూరుకు చెందిన భార్గవ్, సైనిక్‌పురికి చెందిన వర్షిత్‌గా పోలీసులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ యాదవ్, దినేశ్‌లను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. బాధితులంతా మాదాపూర్‌లోని ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగులని తెలిసింది.

ప్రమాదానికి ముందు వీరంతా మాధారంలోని ఒక గెస్ట్‌హౌస్‌లో జరిగిన విందులో పాల్గొన్నారు. అక్కడి నుంచి తెల్లవారుజామున కారులో తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. వాహనం మితిమీరిన వేగంతో ప్రయాణించడం వల్లే ఈ ఘోర ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. విద్యుత్తు స్తంభాన్ని కారు బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.

ఘటనా స్థలానికి చేరుకున్న ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే సంస్థలో పనిచేస్తున్న యువకులు ఇలా అకాల మరణం చెందడం స్థానికంగా విషాదం నింపింది.
Go Back to Shorts
Bhargav
Ghatkesar accident
Hyderabad road accident
IT employees death
Madhapur IT company
Road accident India
Kuntloor
Sainikpuri
Medchal Malkajgiri district

More Telugu News