Gali Janardhan Reddy: ఓఎంసీ కేసు: బెయిల్ కోసం హైకోర్టు మెట్లెక్కిన గాలి జనార్దనరెడ్డి

Gali Janardhan Reddy Moves Telangana High Court for Bail in OMC Case
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ (ఓఎంసీ) కేసులో దోషులుగా తేలిన నలుగురు తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డితో పాటు బీబీ శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్‌, అలీ ఖాన్‌లు నేడు ఉన్నత న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.

తమ పిటిషన్లలో, తమను దోషులుగా నిర్ధారించడానికి సీబీఐ కోర్టు తగిన ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో తాము మూడున్నరేళ్లకు పైగా జైలు జీవితం గడిపామని వారు కోర్టు దృష్టికి తెచ్చారు. గతంలో విచారణ సమయంలో తమకు బెయిల్ మంజూరైనప్పుడు ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని, కోర్టు విధించిన షరతులకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని వారు గుర్తుచేశారు. ఇప్పుడు కూడా బెయిల్ మంజూరు చేస్తే, కోర్టు నిర్దేశించిన అన్ని నిబంధనలను తప్పకుండా పాటిస్తామని పిటిషనర్లు తమ అభ్యర్థనలో వివరించారు.

కాగా, ఈనెల 6వ తేదీన హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఓఎంసీ కేసుకు సంబంధించి తుది తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పులో గాలి జనార్దనరెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్‌, అలీఖాన్‌లను దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు శిక్ష ఖరారు చేసింది. తీర్పు వెలువడిన నాటి నుంచి వీరంతా చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. తమకు విధించిన శిక్షను సవాలు చేస్తూ, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వారు ఇప్పుడు హైకోర్టు తలుపు తట్టారు.
Go Back to Shorts
Gali Janardhan Reddy
Obulapuram Mining Corporation
OMC Case
Bail Plea
Telangana High Court
CBI Court
B. Sriramulu
Rajagopal
Ali Khan
Mining Scam

More Telugu News