గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు రాజీనామా
- ఏడాది పదవీకాలం ఉండగానే రాజీనామా
- 2021లో వైసీపీ నుంచి మేయర్గా ఎన్నికైన మనోహర్ నాయుడు
- గత కొంతకాలంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, మేయర్ మధ్య వివాదం
అటు, వైసీపీ నుంచి కార్పొరేటర్లు కూటమిలో చేరడంతో వైసీపీకి పరాభవం తప్పలేదు. ఈ నెల 17న స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మనోహర్ నాయుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది. మరోవైపు గత కొంతకాలంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, మేయర్ మనోహర్ మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో మరో ఏడాది పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు.