స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో ఇనుపరాడ్డుతో దుండగుడి దాడి
- ఈ దాడిలో ఐదుగురికి గాయాలైనట్లు వెల్లడించిన పోలీసులు
- నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
- పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు వెల్లడించిన పోలీసులు
భక్తులు, స్థానికులు ఉన్న కమ్యూనిటీ కిచెన్ వద్ద దుండగుడు ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ దాడిలో గాయపడిన వారిలో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీకి చెందిన ఇద్దరు వాలంటీర్లు కూడా ఉన్నారు. గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు రెక్కీ నిర్వహించి ఈ దాడికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.