లోయలో పడిన ట్రక్కు .. ముగ్గురు బీఎస్ఎఫ్ జవానుల మృతి

3 bsf personnel died as truck pluges into gorge in manipur
  • లోయలో పడిన సైనికుల వాహనం
  • మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలో ఘటన
  • అక్కడికక్కడే ఇద్దరు, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరి మృతి
వాహనం లోయలో పడటంతో ముగ్గురు బీఆర్ఎస్ జవానులు మృతి చెందిన ఘటన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో 13 మంది సైనికులు గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సైనికులతో వెళుతున్న ట్రక్ అదుపుతప్పి లోయలో పడిపోవడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు.
 
ఈ ఘటనపై మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.  
Go Back to Shorts
Road Accident
Manipur
BSF Personnel
Crime News

More Telugu News