ఇరిగేషన్ అధికారులపై ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం
- అమృతధార పథకం డీపీఆర్ ను సిద్ధం చేయడంలో విఫలమయ్యారన్న ఆనం
- హాఫ్ మైండ్ తో పని చేయవద్దని మండిపాటు
- వెంటనే సరైన డీపీఆర్ ఇవ్వాలని ఆదేశం
స్పష్టంగా లేని ప్రాజెక్ట్ రిపోర్టును ప్రభుత్వానికి అధికారులు ఇచ్చారని... ఇలాంటి ధోరణిని వెంటనే మార్చుకోవాలని అన్నారు. వెంటనే సరైన డీపీఆర్ ను ఇవ్వాలని చెప్పారు. హాఫ్ మైండ్ తో పని చేయవద్దని అన్నారు. అధికారులు ఇచ్చే రిపోర్ట్ పై రేపు తాను కేబినెట్ లో వివరించాల్సి ఉంటుందని చెప్పారు. సరిగ్గా లేని రిపోర్ట్ తో ప్రాజెక్ట్ పనులు మధ్యలోనే ఆగిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పారు.