తొలి విడతలో మండలానికి ఓ గ్రామంలో రైతు భరోసా: మంత్రి తుమ్మల
- రైతు భరోసా నగదు జమ కొనసాగుతోందన్న మంత్రి
- 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు వెల్లడి
- ఈరోజు రూ.530 కోట్లు జమ చేశామన్న మంత్రి
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు చెప్పారు. మొత్తం 577 మండలాల్లోని 9,48,333 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు వేశామని, ఈ మొత్తం రూ.530 కోట్లు అని వెల్లడించారు. రైతు భరోసా సొమ్మును బ్యాంకులో నుంచి తీసుకోవచ్చని చెప్పారు.