వైట్ హౌస్ పై దాడి చేసిన హైదరాబాద్ యువకుడికి జైలు శిక్ష
- 2024 మేలో వైట్ హౌస్ పై దాడి చేసిన సాయి కందుల
- బ్యారికేడ్లను ట్రక్కుతో ఢీ కొట్టిన వైనం
- ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు
సాయి కందుల వయసు 20 ఏళ్లు. హైదరాబాద్ లోని చందానగర్ లో జన్మించాడు. 2024 మే 13న వైట్ హౌస్ పై దాడి చేశాడు. రాత్రి 9.35 గంటలకు వైట్ హౌస్ వెలుపల ఉన్న బారికేడ్లను ట్రక్కుతో ఢీకొట్టాడు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్న జనాలు భయంతో పరుగులు పెట్టారు. ఆ తర్వాత సాయి కందుల ట్రక్కు దిగి ట్రక్కు వెనక్కి వెళ్లాడు. ఆ తర్వాత నాజీ జెండా తీసి, ఎగురవేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతాదళాలు సాయిని అరెస్ట్ చేశాయి. తాజాగా కోర్టు అతనికి జైలు శిక్షను విధించారు.