దావోస్కు వెళ్లే చంద్రబాబు టీమ్ లో ఎవరెవరుంటారంటే...!
- ఈ నెల 20 నుంచి 24 వరకూ సీఎం దావోస్ లో పర్యటన
- ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- సీఎం బృందంలో మొత్తం 9 మంది
రాష్ట్రంలో వనరులు, పెట్టుబడి అవకాశాలను వీరు ప్రపంచ ఆర్ధిక సదస్సులో వివరించనున్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని దావోస్ పర్యటన బృందంలో మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా, సీఎం సెక్యూరిటీ అధికారి శ్రీనాథ్ బండారు, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి, పరిశ్రమల కార్యదర్శి యువరాజ్, ఏపీ ఈడీబీ సీఈవో సాయి కాంత్ వర్మ, కాడా పీడీ వికాస్ మర్మత్ ఉండనున్నారు.