‘ఫార్ములా-ఈ’ కేసులో నేడు విచారణకు కేటీఆర్
- ఫార్ములా-ఈ కారు రేసులో కేటీఆర్పై ఆరోపణలు
- ఈ ఉదయం 10 గంటలకు హాజరు కానున్న కేటీఆర్
- రేపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎదుట హాజరు
- సహ నిందితులుగా బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్కుమార్
ఈ నేపథ్యంలో 6న ఉదయం 10 గంటలకు విచారణకు రావాల్సిందిగా కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఇదే కేసులో రేపు (7న) తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేటీఆర్కు సమన్లు జారీచేసింది. ఇదే కేసులో సహ నిందితులైన బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్కుమార్లను ఈ నెల 2,3 తేదీల్లోనే విచారించాల్సి ఉండగా, తమకు కొంత సమయం కావాలని కోరడంతో వారికి ఈడీ వారం రోజుల సమయం ఇచ్చింది.