చివరి టెస్టు కోసం సిడ్నీ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు

Team India arrives Sydney for fifth test
  • టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
  • జనవరి 3 నుంచి సిడ్నీలో ఐదో టెస్టు
  • ఇప్పటికే సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆసీస్
  • చివరి టెస్టు నెగ్గి సిరీస్ సమం చేయాలని భావిస్తున్న టీమిండియా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు కోసం టీమిండియా ఆటగాళ్లు సిడ్నీ చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. అయితే, జట్టు వెంట కోహ్లీ కనిపించకపోవడం చర్చనీయాంశం అయింది. 

సిరీస్ లో చివరిదైన ఈ టెస్టు సిడ్నీలో జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జరగనుంది. మెల్బోర్న్ టెస్టులో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా... చివరి టెస్టులో నెగ్గి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. 

ఈ ఐదు టెస్టుల సిరీస్ లో టీమిండియా తొలి టెస్టు నెగ్గగా, రెండో టెస్టులో ఆసీస్ నెగ్గింది. మూడో టెస్టు డ్రాగా ముగియగా... నాలుగో టెస్టును ఆసీస్ కైవసం చేసుకుని సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. 

చివరి టెస్టులో టీమిండియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఆసీస్ గెలిస్తే సిరీస్ వారి వశం అవుతుంది. కనీసం డ్రా చేసుకున్నా ఆసీస్ సిరీస్ విజేతగా నిలుస్తుంది.
Advertisement
Team India
Sydney
5th Test
Australia
Border-Gavaskar Trophy

More Telugu News