Jagan: పెండింగ్ బిల్లుల గురించి అడిగిన వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లపై జగన్ అసహనం

Jagan Praja Darbar in Pulivendula
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్ నిన్న పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించిన సంగతి తెలిసిందే. జగన్ ని కలిసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదంటూ కొందరు వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లు అక్కడ రచ్చ చేశారు. జగన్ ను కలిసేందుకు క్యాంపు కార్యాలయంలోకి దూసుకుపోయే ప్రయత్నం చేశారు. 

ఈ క్రమంలో కార్యాలయం ద్వారం వద్ద తోపులాట జరిగింది. ద్వారం పక్కనున్న అద్దం పగిలిపోయింది. అద్దం ముక్కలు గుచ్చుకుని కొందరికి గాయాలయ్యాయి. తోపులాటను అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లతో జగన్ మాట్లాడుతూ... 'ఇప్పుడు కూడా బిల్లులు అడుగుతున్నారేందన్నా... ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా అన్నా?' అని అసహనం వ్యక్తం చేశారు. 

గత ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు బిల్లులు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి. దీంతో, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది కాంట్రాక్టర్లు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పనులు చేసిన కొందరు వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లు బిల్లులపై జగన్ ను ప్రశ్నించే ప్రయత్నం చేశారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Contractors

More Telugu News