KTR: హైకోర్టులో కేటీఆర్ పిటిష‌న్‌

KTR Filed Quash Petition in High Court on ACB Case
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో ఆయ‌న‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విష‌యం తెలిసిందే. త‌న‌పై ఏసీబీ న‌మోదు చేసిన కేసును క్వాష్ చేయాల‌ని కోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. భోజ‌న విరామం త‌ర్వాత దీనిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆయ‌న కోరారు. 

కాగా, ఫార్ములా ఈ-కార్ రేస్‌ కేసులో ఏసీబీ.. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చిన సంగ‌తి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ఏసీబీ గురువారం కేసు న‌మోదు చేసింది. 
Go Back to Shorts
KTR
Quash Petition
High Court
ACB Case
Telangana

More Telugu News