ధాన్యం కొనుగోళ్లపై వ్యాపారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
- రైతులను ఇబ్బందిపెడితే చర్యలు తీసుకుంటామన్న సీఎం
- వ్యాపారులు ఇబ్బందిపెడితే ఎస్మా కింద చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
- పంట కొనుగోళ్లలో మోసాలకు పాల్పడకుండా చూడాలన్న సీఎం
పంట కొనుగోళ్లలో మోసాలకు పాల్పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. రైతులను వేధిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. కలెక్టర్లు కూడా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చూడాలన్నారు. రైతులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారులతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరించాలన్నారు.