Narendra Modi: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై నెతన్యాహుతో మాట్లాడాను: ప్రధాని మోదీ

PM Modi talks to Israel PM Benjamin Netanyahu
షార్ట్స్‌లో చూడండి
ఏకకాలంలో పలు మిలిటెంట్ సంస్థలతో ఇజ్రాయెల్ పోరాటం సాగిస్తున్న సంగతి తెలిసిందే. లెబనాన్ అతివాద గ్రూపు హెజ్బొల్లా నాయకత్వాన్ని తుదముట్టించిన ఇజ్రాయెల్... తాజాగా యెమెన్ మిలిటెంట్ సంస్థ హౌతీపైనా విరుచుకుపడుతోంది. 

ఈ నేపథ్యంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ విషయాన్ని మోదీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించారు. 

శాంతి స్థాపన, స్థిరత్వం నెలకొల్పే చర్యలకు మద్దతు ఇవ్వాలనేది తమ వైఖరిని, అందుకు తాము ఎప్పటికీ కట్టుబడి ఉంటామని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచంలో ఉగ్రవాదానికి తావులేదని అన్నారు. ఉద్రిక్తతలు మరింత విస్తరించకుండా చూడాల్సిన అవసరం ఉందని, బందీలను విడిచిపెట్టడం అనేది ముఖ్యమైన అంశమని మోదీ అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Narendra Modi
Benjamin Netanyahu
India
Israel

More Telugu News