తిరుమల నెయ్యి కల్తీపై వైసీపీ నేత తమ్మినేని కీలక వ్యాఖ్యలు
- పోషకాహార లోపంతో బాధపడుతున్న ఆవుల పాల నుంచి ఆ నెయ్యి తయారు చేసి ఉండొచ్చన్న తమ్మినేని
- ఆవాలు, అవిశలు, పామాయిలు వంటి వ్యర్థాలను తీసుకునే ఆవుల పాలు కల్తీ అవుతాయన్న వైసీపీ నేత
- పరీక్షల్లో కచ్చితంగా ఉండవని ఎస్డీబీబీ తన నివేదికలో చెప్పిందన్న మాజీ స్పీకర్
కూటమి నేతలు ఆరోపిస్తున్నట్టు లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటివి లోపలికి అనుమతించింది మీరే అవుతారని విమర్శించారు. పరీక్షల్లో కచ్చితత్వం లోపించే అవకాశం లేకపోలేదని, ఎస్డీబీబీ తన నివేదికలో స్పష్టం చేసిందని తెలిపారు. ఎంతో భద్రంగా చేయాల్సిన పనిని అల్లరి చేస్తే మన దేవుడిని మనమే తగ్గించుకోవడం అవుతుందన్నారు. చంద్రబాబునాయుడు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతినే దుస్థితి వచ్చిందని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.